News February 4, 2025
అమ్మాయిలూ.. జాగ్రత్త!
సోషల్ మీడియాలో పరిచయమవుతున్న అపరిచితులు స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని TSRTC సజ్జనార్ పేర్కొన్నారు. తెలియని వాళ్లతో చనువుగా ఉండి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంచుకోవద్దని సూచించారు. ‘అజ్ఞాత వ్యక్తులతో స్నేహం పరిధి దాటి ముందుకు వెళితే మీకే నష్టం. మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎవరిని పడితే వాళ్లని ఫాలో అవ్వడం, వారితో చాట్ చేయకండి’ అని యువతకు సందేశం ఇచ్చారు.
Similar News
News February 4, 2025
రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్పై కేసు
రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.
News February 4, 2025
అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు.. కానీ: రొనాల్డో
రొనాల్డో – మెస్సీ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అభిమానులు మెస్సీనే గొప్ప అనొచ్చు అని ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అన్నారు. ‘కానీ సాకర్ చరిత్రలో ఇప్పటివరకూ నా లాంటి ప్లేయర్ని చూసుండరు. నేనే కంప్లీట్, బెస్ట్ ప్లేయర్ని’ అని తెలిపారు. మెస్సీకి తనకు మంచి స్నేహం ఉందన్నారు. స్పానిష్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో రొనాల్డో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
News February 4, 2025
AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయండి: లోకేశ్
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఢిల్లీలో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయాలని కోరారు. AI అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ కోరారు.