News February 4, 2025
KCR, KTRకి కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కేపీ వివేక్

అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్గా కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానందను ప్రకటించిన సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమ్మకంతో తనకు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, పార్టీ ప్రతిష్ఠను పెంచేలా పని చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
కోస్గి: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశా త్తు ఓ దివ్యాంగుడు మృతి చెందిన సంఘటన కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. SI బాలరాజ్ కథనం.. సోమవారం సాయంత్రం ఈర్లపల్లి చెరువుకు చేపల కోసం వెళ్లి ఆంజనేయులు(30) వెళ్లి మరణించాడు. బతుకుదెరువు కోసం కల్వకుర్తి నుంచి గుండుమాల్ దగ్గరలోని అప్పయ్య పల్లికి వచ్చాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు.
News November 11, 2025
WGL: పాలకవర్గాలు లేక నిధుల నిలిపివేత..!

గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయలేమని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులపై ఆశలు వమ్మయ్యాయి. కేంద్ర నిధులు 2024 ఆగస్టు నుంచి రాష్ట్ర ఎస్ఎఫ్సీ నిధులు 2023 ఆగస్టు నుంచి నిలిచిపోయాయి. ఉమ్మడి WGL జిల్లాలోని 1708 జీపీల్లో సుమారు రూ.70 కోట్లు ట్రెజరీల్లో నిలిచి, గ్రామాల్లో అభివృద్ధి పనులు స్తబ్ధుగా మారాయి.
News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి


