News February 4, 2025

DC ఓనర్ మన తెలుగు వారేనని తెలుసా?

image

IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్‌ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

Similar News

News March 19, 2026

ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 19, 2026

హార్ముజ్ మాత్రమే కాదు మరో రూట్ పైనా ఇరాన్ అటాక్!

image

ఇరాన్‌లోని అతిపెద్ద LNG ప్లాంట్ అయిన ‘సౌత్ పార్స్’పై నిన్న ఇజ్రాయెల్ దాడి చేయడంతో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో సౌదీ ఎర్రసముద్ర తీరంలోని యన్బు పోర్ట్ ద్వారా చమురు ఎగుమతి చేస్తోంది. తాజాగా ఇరాన్ అక్కడి SAMREF ఆయిల్ రిఫైనరీపైనా అటాక్ చేసింది. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.