News February 4, 2025
HYDలో 2 రెట్లు మించిన గాలి కాలుష్యం

ఒక ఘనపు మీటర్ గాలిలో (సూక్ష్మ ధూళికణాలు) పీఎం10 స్థాయి 45 గ్రాములు మించి ఉండొద్దు. కానీ.. HYDలో 2.11 రేట్లు అంటే 95 గ్రాములకు పైగా నమోదవుతున్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ HYD వెల్లడించింది. హోటళ్లలో కట్టెల పొయ్యిలు ఉపయోగించడం, 15 ఏళ్లకుపైగా వాహనాలు రోడ్డెక్కడం, చెత్తను కాల్చడం, ఇంధనాలు, కల్తీ, దుమ్మూ కాలుష్యం, వాహనాలు వల్ల జరుగుతున్నట్లు కారణంగా చెప్పుకొచ్చింది.
Similar News
News March 21, 2026
డిన్నర్కు వెళ్లా అంతే..: పుట్టా మహేశ్

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో TDP అధిష్ఠానానికి MP పుట్టా మహేశ్ వివరణ ఇచ్చారు. డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో TDP <<19392082>>షోకాజ్<<>> నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు TG మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికీ BRS షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఆయన స్పందించాల్సి ఉంది.
News March 21, 2026
విశాఖ: ‘సోషల్ మీడియాలో జాబ్స్ ప్రకటనలు నమ్మవద్దు’

హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన కేంద్రం పేరుతో నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులపై సోషల్ మీడియాలో నకిలీ నియామక ప్రకటనలు వెలుగు చూశాయి. పోస్టుల సంఖ్య, జీతం, అర్హతలు, చివరి తేదీ వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆసుపత్రి నుంచి విడుదల కాలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారానే సమాచారం ధ్రువీకరించుకోవాలని సూచించారు.
News March 21, 2026
నల్గొండ- మాచర్ల రైల్వే మార్గంపై వీడని నిరీక్షణ

నల్గొండ నుంచి హాలియా మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ కల సాకారం కోసం సాగర్ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లలో కేంద్రం రూ.2 కోట్లు కేటాయించి, రెండుసార్లు సర్వే నిర్వహించినా పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి, ఈ నిరీక్షణకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.


