News February 4, 2025
అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు

తమ దేశంలోని అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరిపై దాదాపు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మామూలు విమానాల్లో టికెట్ ధర 853 డాలర్లు ఉండగా, ఇందుకు 5 రెట్లు వెచ్చిస్తోంది. వలసదారులందరినీ సీ-17, సీ-130ఈ మిలటరీ విమానాల్లోనే వారి దేశాలకు తరలిస్తోంది. ఈ విమానాల నిర్వహణకు గంటకు దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం.
Similar News
News November 3, 2025
నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.
News November 3, 2025
కంకర ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం!

TG: చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా సమయంలో టిప్పర్లోనే యజమాని లక్ష్మణ్ ఉన్నారు. లడారం-శంకర్పల్లి వరకు టిప్పర్ను ఆయనే నడిపారు. ఆ తర్వాత డ్రైవర్ ఆకాశ్కు ఇచ్చారు. గాయపడిన లక్ష్మణ్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 3, 2025
ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.


