News February 4, 2025
టీడీపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు: ఎమ్మెల్యే

నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్గా ఎన్నుకున్నామని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీలో అభిప్రాయ భేదాలు అని కొంత మంది ప్రచారం చేశారన్నారు. ‘మా టీడీపీ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని తన అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించానని ఎమ్మెల్యే వివరించారు’.
Similar News
News March 10, 2026
గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.
News March 10, 2026
సిద్ధిపేట: ‘ఆరోగ్య ఖాకీ’కి సీపీ శ్రీకారం

పోలీస్ అధికారుల సంక్షేమం కోసం సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారం ‘ఆరోగ్య ఖాకీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శారీరకంతో పాటు మానసిక దృఢత్వం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మంది సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి ఫిట్గా ఉండాలని కోరారు.
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.


