News February 4, 2025
AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయండి: లోకేశ్

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో ఢిల్లీలో మంత్రి లోకేశ్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. AI సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని APలో ఏర్పాటు చేయాలని కోరారు. AI అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని లోకేశ్ కోరారు.
Similar News
News November 7, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్(ఫీచర్ ఫిల్మ్)గా ‘కమిటీ కుర్రాళ్లు’ డైరెక్టర్ యధు వంశీ నామినేట్
☛ DEC 25న థియేటర్లలోకి మోహన్లాల్ ‘వృషభ’ మూవీ
☛ ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ నుంచి అనుష్క శెట్టి లుక్ రివీల్. రోజిన్ థామస్ దర్శకుడు. ప్రధాన పాత్రలో మలయాళ నటుడు జయసూర్య
☛ TV యాడ్ కోసం సచిన్ టెండూల్కర్ను డైరెక్ట్ చేసిన ‘OG’ డైరెక్టర్ సుజీత్
News November 7, 2025
పెళ్లి ఏర్పాట్లలో రష్మిక!

విజయ్ దేవరకొండతో రష్మిక మంధాన వచ్చే ఏడాది వివాహ <<18217983>>బంధంలోకి <<>>అడుగు పెట్టనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్ జైపూర్(రాజస్థాన్)లో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సరైన వేదిక కోసం రష్మిక 3 రోజులు అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. జైపూర్లోని పలు రిసార్టులను పరిశీలించారని టాక్. త్వరలోనే వేదికను ఖరారు చేయనున్నట్లు సినీ వర్గాల ప్రచారం.
News November 7, 2025
అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం

AP: నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు.


