News February 4, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు @ప్రపంచ కాన్సర్ డే.. రన్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ @కొండగట్టులో రథసప్తమి వేడుకల్లో.. భక్తుల సందడి @మెట్పల్లి మిషన్ భగీరథ పైప్లైన్ పురోగతి పనులను పరిశీలించిన కలెక్టర్ @జగిత్యాల, మెట్పల్లి లో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం @కథలాపూర్లో రెండో విడత దళిత బంధు అమలు చేయాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం @వెల్గటూరు లో ఎస్సై శ్వేతకు కొవ్వత్తులతో నివాళులు
Similar News
News March 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

♦ డయేరియా ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
♦పాతపట్నం సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే గోవింద్
♦ టెక్కలి: భూములు ఇవ్వమంటూ రైతుల నిరసన
♦ జిల్లాలో దివ్యంగ శక్తి పథకం ప్రారంభం
♦శ్రీకాకుళం: మామిడి కాయలు కొరత
♦ నరసన్నపేట: జూనియర్ క్రీడా మైదానంలో నాగుపాము సంచారం
♦ టెక్కలి: రెండు నెలలలో ఇద్దరు కిడ్నీ రోగులు మృతి
News March 18, 2026
చీరాల 1 టౌన్ ఎస్ఐ భాస్కరరావు మృతి

చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆయనకు ఇంటి వద్ద హార్ట్ఎటాక్ వచ్చింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ మొయిన్, సీఐలు సుబ్బారావు, అశోక్ కుమార్, మల్లికార్జునతో పాటు పోలీసులు నివాళులు అర్పించారు. ఆయన 42 ఏళ్ల నుంచి పోలీస్ విభాగంలో సేవలందించారన్నారు.
News March 18, 2026
రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి ఉత్తమ్

రాష్ట్ర ప్రజలకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆశలు, లక్ష్యాలతో ప్రజలంతా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతాంగానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.


