News March 19, 2024

HYD వచ్చిన యువతి.. వ్యభిచారం చేయాలని దాడి..!

image

ఉపాధి కోసం HYDకు వచ్చిన యువతితో వ్యభిచారం చేయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాకు చెందిన యువతి టెలీకాలర్ జాబ్ కోసం ఈనెల 10న నగరంలోని MGBS బస్టాండ్‌కు వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి IBPకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వంగపహాడ్‌(WGL)కు తరలించి వ్యభిచారం చేయాలని దాడి చేశారు. ఈ విషయమై బాధితురాలు హసన్‌పర్తి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News October 23, 2025

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్‌ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 23, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: KCR ప్లాన్ ఇదే!

image

జూబ్లీహిల్స్‌ బైపోల్ కోసం KCR వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలతో నేడు సమావేశం అవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి నేతలకు సూచనలు ఇస్తారు. ఇప్పటికే స్థానిక INC, బీజేపీ నేతలతో కేటీఆర్ రహస్య సమావేశం అయినట్లు సమాచారం. ఉప ఎన్నిక ముందు జూబ్లీహిల్స్‌లో కీలక నాయకులను BRSలోకి ఆహ్వానించి, కాంగ్రెస్, BJPని బలహీనపరచాలని KCR ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.

News October 23, 2025

HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్‌లో సోను

image

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.