News February 5, 2025

మంచిర్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

1: MNCL: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
2:మంచిర్యాల: యాక్సిడెంట్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి
3:గుండెపోటుతో జన్నారం అదనపు ఎస్సై మృతి
4:ALL INDIA తెలుగు CARTOONISTల డైరెక్టరీలో బెల్లంపల్లి వాసి
5:MNCL: రాష్ట్రస్థాయి క్రీడల్లో కమిషనరేట్‌కు 3వ స్థానం
6:మంచిర్యాలలో పేకాట రాయుళ్లు అరెస్ట్

Similar News

News March 10, 2026

12న ప్రజా ప్రతినిధులకు శిక్షణ: కామారెడ్డి కలెక్టర్

image

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సీఎస్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

News March 10, 2026

గుంటూరు ‘పుర’ అధికారుల నియామకం

image

గుంటూరు జిల్లాలో పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో GMCకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, తెనాలికి గుంటూరు JC అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. మార్చి 17న ప్రస్తుత పాలకవర్గం బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త పాలకవర్గం కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.

News March 10, 2026

తూ.గో: గోదావరిలో దూకిన భార్య.. పోలీసులకు భర్త ఫోన్.. చివరికి

image

కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన 40 ఏళ్ల మహిళను పోలీసులు కాపాడారు. ఆమె భర్త 112కు కాల్ చేయడంతో SP డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పోలీసులు వెంటనే స్పందించారు. నదిలోకి దిగి చాకచక్యంగా మహిళను ఒడ్డుకు చేర్చి ప్రాణాలు రక్షించారు. సకాలంలో స్పందించిన పోలీసుల తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.