News February 5, 2025
డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తా: లోకేశ్

AP: రాష్ట్ర ప్రజల డేటా చోరీ <<15354528>>ఆరోపణలపై<<>> వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ‘మా హయాంలో డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే వైసీపీ నేతలకు వ్యక్తిగతంగా రూ.10 కోట్లు ఇస్తా’ అని ఛాలెంజ్ చేశారు. కాగా 2014లో సీఎం చంద్రబాబు సేవా మిత్ర పేరుతో ప్రజల వ్యక్తిగత డేటా చోరీ చేశారని, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అదే పని చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
Similar News
News April 6, 2026
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

హత్య కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.
News April 6, 2026
త్వరలో సినిమాలకు త్రిష గుడ్బై?

TVK చీఫ్, హీరో విజయ్తో రిలేషన్పై రూమర్స్ నడుస్తున్న వేళ నటి త్రిషపై సినీవర్గాల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్పై చెప్పే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ప్రేమ గురించి ఆమె ఇటీవల <<19575762>>ఇన్స్టాలో<<>> షేర్ చేసిన పోస్ట్తో ఇది మొదలైంది. ఇక రీసెంట్గా ఆమె ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పకపోవడంతో ఈ వదంతులకు బలం చేకూరింది. అయితే దీనిపై త్రిష స్పందించాల్సి ఉంది.
News April 6, 2026
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది!

ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL రూ.1 ప్లాన్ ఆఫర్ను మళ్లీ తెచ్చింది. రూపాయికే 30 రోజుల పాటు వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను అందిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు కొత్త వినియోగదారులకే ఈ ఆఫర్ వర్తించనుంది. తమ సర్వీస్ సెంటర్/రిటైలర్ వద్ద ఉచితంగా సిమ్ పొందొచ్చని BSNL ట్వీట్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘BSNL ఆజాదీ కా ప్లాన్’ పేరిట గతంలో ఈ ఆఫర్ను సంస్థ తీసుకొచ్చింది.


