News February 5, 2025
వాళ్లందరికీ జీరో కరెంట్ బిల్: కేంద్రం
‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ ద్వారా 45% మందికి జీరో కరెంట్ బిల్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని 8.64లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి దాదాపు రూ.77,800 కేంద్రం అందిస్తోందన్నారు. జీరో బిల్లు అనేది సోలార్ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
Similar News
News February 5, 2025
ప్రభాస్ సినిమాలో సాయిపల్లవి?
హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో డార్లింగ్ ప్రేయసి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాకే హైలైట్గా నిలిచేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News February 5, 2025
డీప్సీక్ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా
ఏఐ రంగంలో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న చైనా డీప్సీక్ను ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. ఆ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ అఫైర్స్ సెక్రటరీ స్టెఫానీ తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, మొబైల్ పరికరాల్లో డీప్సీక్ ఉత్పత్తులను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సౌత్ కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ కూడా డీప్సీక్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News February 5, 2025
నేడే ఢిల్లీ పోలింగ్.. సర్వం సిద్ధం
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. వరుసగా మూడో సారి గెలవాలని ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ, పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.