News February 5, 2025
లక్షెట్టిపేట: ‘సుస్థిర ఆస్తుల కల్పన EGSలోనూ సాధ్యం’

సుస్థిర ఆస్తుల కల్పన MNREGSలో సాధ్యమవుతుందని DRDO కిషన్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపూర్, పోతపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, ఇతర పనులను పరిశీలించారు. రైతులకు పశువుల కొట్టాలు, అజోల గడ్డి పెంపకం, నాడేపు కంపోస్ట్, చెక్ డ్యామ్స్, కిచెన్ షెడ్, పాఠశాల ప్రహరీల వంటి సుస్థిర ఆస్తులు ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్నామన్నారు.
Similar News
News March 23, 2026
ఏప్రిల్ 2 నుంచి JEE మెయిన్ సెషన్-2 ఎగ్జామ్స్

JEE మెయిన్-2026 చివరి విడత (సెషన్-2) పరీక్షల షెడ్యూల్ను NTA ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకునేలా ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్స్’ను NTA విడుదల చేసింది. అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచి ఈ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పరీక్షకు కొన్ని రోజుల ముందు వస్తాయి.
News March 23, 2026
నేడు అకౌంట్లలోకి రూ.6,000

TG: సిద్దిపేట పర్యటనలో నిన్న సీఎం రేవంత్ <<19449281>>విడుదల<<>> చేసిన తొలి విడత రైతు భరోసా నిధులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. రూ.6వేల చొప్పున రూ.3,600 కోట్లు అన్నదాతల ఖాతాల్లో చేరనున్నాయి. మరో 20 రోజుల్లో రూ.2,700 కోట్లు, ఆ తర్వాత 20 రోజులకు రూ.2,700 కోట్లు రిలీజ్ చేస్తామని రేవంత్ వెల్లడించారు. మొత్తంగా దాదాపు 70 లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తామన్నారు.
News March 23, 2026
అనకాపల్లి: ఇవాళ ఈ నంబరుకు కాల్ చేయండి

విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నెంబర్ కు కాల్ చేసి సమస్యలు తెలియచేయవచ్చునని అన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


