News February 5, 2025
అమ్రాబాద్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అమ్రాబాద్ మండలం బికే లక్ష్మాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, ప్రతిరోజు ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు.
Similar News
News March 17, 2026
కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనులపై ఫోకస్ పెంచాలి: కలెక్టర్

CM రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
News March 17, 2026
GWL: కేజీబీవీ లకు కేటాయించిన బడ్జెట్ వినియోగించాలి

కేజీబీవీలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కేజీబీవీలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమతి లేకుండా ఎవరిని పాఠశాలలోకి అనుమతించరాదన్నారు. విద్యార్థుల సంక్షేమం, భద్రతపై ప్రిన్సిపాళ్లు దృష్టి పెట్టాలన్నారు.
News March 17, 2026
HNK: కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లకు ఊరట

అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీ స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా ఛార్జీల విధింపులో ఊరట లభించిందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు. నూతన విధానంతో ఈ కేటగిరిలో మార్కులు జరిగాయన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం ఉండదన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే ఉంటుందన్నారు.


