News February 5, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ: డీఈవో

గ్రామపంచాయతీ ఎన్నికలకు శిక్షణ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు రేపు హైదరాబాదులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లా నుంచి వివిధ పాఠశాలలో పనిచేస్తున్నా 10 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
కరీంనగర్: బతుకమ్మ చీరలు మాకు లేవా..?

బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే చీరలను మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే అందజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా, గత BRS ప్రభుత్వం రేషన్ కార్డుల్లో పేరుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిందని మహిళా సంఘాల్లో సభ్యత్వం లేని మహిళలు అంటున్నారు. సభ్యత్వం ఉన్నవారికే బతుకమ్మ చీరలా? మాకు లేవా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉమ్మడి KNRలో దాదాపు 45,350 మహిళా సంఘాలు ఉన్నాయి.
News September 16, 2025
హుకుంపేట: JCBని ఢీ కొట్టిన బైక్.. యువకుడి మృతి

పాడేరు మండలం చింతలవీధి సమీపంలో ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. దాలిగుమ్మడి గ్రామానికి చెందిన థామస్ ప్రవీణ్ హుకుంపేట నుంచి పాడేరుకు బైక్పై వస్తూ JCBని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
News September 16, 2025
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగామ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రేపు జరగబోయే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. జెండా ఆవిష్కరణ, గౌరవ వందనం ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు. వీఐపీ, మీడియా పాయింట్లకు ఇబ్బందులు కలగకుండా సీట్లను సమకూర్చాలని సూచించారు. కలెక్టరేట్ ఏవో, ఆర్డీవో, తహశీల్దార్లు ఉన్నారు.