News February 5, 2025
పలాస: అబాకస్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.
Similar News
News March 4, 2026
శ్రీకాకుళం: పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్ డిప్లమా ప్రవేశాల పరీక్ష పాలిసెట్-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కన్వీనర్ నారాయణరావు బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులుగా చెప్పారు. https://polycetap.ap.gov. ఇన్ వెబ్సైట్లో ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పది కళాశాలలు ఉన్నాయన్నారు.
News March 4, 2026
జనసేన ఆఫీసుపై దాడి.. శ్రీకాకుళం జిల్లా యువకుడి అరెస్ట్

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.
News March 4, 2026
శ్రీకాకుళం: పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో వివాహిత సాయి తేజ(23) ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నర్సింగరావు మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన తేజ పిల్లలు పుట్టలేదని మనస్తాపంతో సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందన్నారు. అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.


