News February 5, 2025

వికారాబాద్: భూ సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి: కలెక్టర్

image

భూసమస్యలతో పాటు ఇతర సమస్యలపై అవగాహన పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతనంగా విధుల్లో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై అవగాహన కల్పించుకొని పరిణతితో ప్రజలకు చక్కగా సేవలందించాలన్నారు. 

Similar News

News March 25, 2026

మమత ముస్లింలకు ఏమీ చేయలేదు: ఒవైసీ

image

పశ్చిమ బెంగాల్ ముస్లింలకు సీఎం మమతా బెనర్జీ ఏమీ చేయలేదని ఒవైసీ విమర్శించారు. ఆమె రాజకీయాలే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడ్డాయని.. ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ముస్లిం నాయకత్వం లేని రాష్ట్రాల్లో వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. హుమాయున్ ఏజేయూ పార్టీతో కలిసి బెంగాల్‌లో ముస్లింల రాజకీయ నాయకత్వ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

News March 25, 2026

పండ్రేగుపల్లి నేత అదృశ్యం సుఖాంతం.. హైదరాబాద్‌లో ఆచూకీ

image

పండ్రేగుపల్లి మాజీ సర్పంచ్ పాము సెల్వరాజు <<19470053>>కిడ్నాప్ <<>>కలకలం సుఖాంతమైంది. బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఆయన అదృశ్యం కావడంతో కిడ్నాప్‌నకు గురయ్యారనే ప్రచారం జరిగింది. బంధువుల ఫిర్యాదుతో సీఐ వడ్డేపల్లి మురళీ దర్యాప్తు చేపట్టి, సెల్వరాజు హైదరాబాద్‌లో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యక్తిగత పనులపైనే వెళ్లానని ఆయన తెలపడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

News March 25, 2026

బొలిశెట్టికి మా పార్టీతో సంబంధం లేదు: జనసేన

image

బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. కావున బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకి జనసేన పార్టీకి సంబంధం లేదన్నారు.