News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల, నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 22, 2026
జగిత్యాలలో 1135 సమస్యలను పరిష్కరించాం: ఎస్ఈ

జగిత్యాల జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిజమైన దిక్సూచిగా ‘ప్రజావాణి’ నిలిచిందని SE బి.సుదర్శనం ఆదివారం తెలిపారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలనే సంకల్పంతో ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్, డివిజన్, సెక్షన్ స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కరించడమే తమ లక్ష్యమని అన్నారు. 1135 సమస్యలను పరిష్కరించామన్నారు.
News March 22, 2026
వరి వద్దు ఈ పంటలు వేయండి: సీఎం

TG: కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలకు మన దేశంలో పండించిన వడ్లు, బియ్యం సరఫరా చేసినా ఇంకా నిల్వలు మిగిలే ఉంటున్నాయి. ఈసారి 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ వరి కొనబోమని కేంద్రం చెప్పింది. ఇప్పటికే 70 లక్షల టన్నులు కొన్నాం. మిగతా వరి ఏం చేయాలి? అందుకే రైతులు మిల్లెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించాలి’ అని సిద్దిపేటలో సూచించారు.
News March 22, 2026
మీ సమస్యలపై రేపు ఫిర్యాదు చేయవచ్చు: కృష్ణా కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ సోమవారం మచలీపట్నంలోని కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. డివిజన్, మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు.


