News February 5, 2025

సిద్దిపేట: జాతీయస్థాయి ఈత పోటీలకు జిల్లా వాసి

image

గుజరాత్ రాష్ట్రంలో మార్చి 3న జరిగే జాతీయ స్థాయి ఈత పోటీలకు సిద్దిపేట జిల్లా వాసి బండి నర్సింలు ఎంపికయ్యారు. హైదరాబాదులోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఈవి నరసింహారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు బండి నరసింహులు జాతీయస్థాయి క్రీడా పోటీలలో గెలుపొంది మంచి పేరు తేవాలాన్నారు.

Similar News

News March 6, 2026

దీదీకి కొత్త తలనొప్పి?

image

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్‌గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్‌గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

News March 6, 2026

మంచిర్యాల: 9న అప్రెంటిస్ షిప్ మేళా

image

మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 9న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై.రమేశ్ తెలిపారు. 11 ప్రముఖ కంపెనీలలో మొత్తం 395 ఖాళీలు ఉన్నాయన, శిక్షణ సమయంలో స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటలకు నిర్వహించనున్న అప్రెంటీషిప్ మేళాకు అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 6, 2026

కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.