News February 5, 2025
సిద్దిపేట: జాతీయస్థాయి ఈత పోటీలకు జిల్లా వాసి

గుజరాత్ రాష్ట్రంలో మార్చి 3న జరిగే జాతీయ స్థాయి ఈత పోటీలకు సిద్దిపేట జిల్లా వాసి బండి నర్సింలు ఎంపికయ్యారు. హైదరాబాదులోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఈవి నరసింహారెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు బండి నరసింహులు జాతీయస్థాయి క్రీడా పోటీలలో గెలుపొంది మంచి పేరు తేవాలాన్నారు.
Similar News
News September 13, 2025
HYD: జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.
News September 13, 2025
పటాన్చెరు: దేవుడు స్థలాన్ని చూపించాడని మిస్సింగ్

యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్చెరులో చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నాను’ అని అన్నకు మెసేజ్ పెట్టాడు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్న పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
MLA సంజయ్కు ఇంటిపోరు.. మళ్లీ ‘గేర్’ మారుస్తారా?

పార్టీ ఫిరాయింపు నోటీసుపై BRSలోనే ఉన్నట్లు JGTL MLA సంజయ్ స్పీకర్కు వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అలాగే స్థానికంగా తనది ఏ పార్టీనో చెప్పుకోలేని సంకట స్థితిలో MLA ఉన్నారు. కాగా, ఎవరి పార్టీలో వారుంటే మంచిదే కదా అంటూ ఇప్పటికే మాజీమంత్రి జీవన్ రెడ్డి సంజయ్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్కు ఇంటిపోరు ఎక్కువవ్వడంతో CONGలో ఉంటారా? BRSలోకి వెళ్తారా? అన్న చర్చ జరుగుతోంది.