News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
ఫ్రెషర్లకు రూ.21 లక్షల జీతం.. ఇన్ఫోసిస్ డ్రైవ్!

దేశంలో మేజర్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల కోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.7-21 లక్షల వరకు ప్యాకేజీ ఉండే అవకాశం ఉందని మనీ కంట్రోల్ తెలిపింది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (లెవెల్ 1-3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ) పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, EEEలో BE, BTech, ME, MTech, MCA చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు వివరించింది.
News December 25, 2025
భువనగిరిలో విషాదం.. యువకుడి సూసైడ్

భువనగిరి పట్టణంలోని పెద్దచెరువు సమీపంలోని రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పట్టణంలోని దోబివాడకు చెందిన శివగా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 25, 2025
విశాఖ: సెప్టిక్ ట్యాంక్లో పడి చిన్నారి మృతి

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆనందపురం మండలంలో చోటుచేసుకుంది. ముచ్చర్లలోని YSR కాలనీలో చిన్నారి ఢిల్లీశ్వరి గురువారం ఆడుకుంటుండగా మూత లేని సెప్టిక్ ట్యాంక్లో కాలుజారి పడిపోయింది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతకగా, సెప్టిక్ ట్యాంకులో తేలాడుతూ
చిన్నారి కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.


