News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
నారాయణ కాలేజీలో ఇంటర్ యువతి మృతి

తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని పవిత్ర(17) మృతిచెందింది. అన్నమయ్య జిల్లా గ్యారంపల్లికి చెందిన ఆమెకు జ్వరం రావడంతో కళాశాల యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత శరీరంపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. రుయా ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది. మార్చురీ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు.
News February 24, 2026
ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా?

ప్రస్తుతకాలంలో యూట్యూబ్, ఇన్స్టాల్లో వైరల్ అయ్యే వాటిని ఫాలో అవడమే ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అవి కొనడం, వాడటం చేస్తున్నారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. సోషల్ మీడియాలో చూపించేవన్నీ నిజం కావని చెబుతున్నారు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించేలా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన ఉత్పత్తులను చూసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.
News February 24, 2026
KNR: పరీక్షలకు వేళాయె.. ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధం

ఉమ్మడి KNR జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. KNR 36,426, PDPL 10,367, JGTL 15,125, సిరిసిల్ల 8,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 45 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


