News February 5, 2025
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య: ASF CI

పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య చేసుకున్న ఆసిఫాబాద్ మండలం బొందగూడలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య(55) పదెకరాల్లో పత్తి సాగు చేశారు. పంట దిగుబడి రాకపోవడంతో రోజూ బాధపడుతుండేవాడు. సోమవారం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News March 11, 2026
సంగారెడ్డి: 12న ‘ప్రజా పాలన’పై అవగాహన సదస్సు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ఈ నెల 12న ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఈ సదస్సుకు హాజరుకావాలని సూచించారు. జూన్ 12 వరకు అమలుకానున్న ఈ ప్రణాళిక ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
News March 11, 2026
VKB: నూతన సర్పంచులకు రేపు అవగాహన సదస్సు: కలెక్టర్

నూతనంగా గెలుపొందిన సర్పంచులకు రేపు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలి కార్ ఫంక్షన్ హాల్లో గురువారం నూతనంగా ఎంపికైన సర్పంచ్లకు ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. సర్పంచులంతా పాల్గొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
News March 11, 2026
PDPL: ‘ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి’

ఎరువులు అధిక మోతాదులో వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. అందుకే ఎరువుల వాడకం తగ్గించి, సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం యూరియా సరఫరా కోసం ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. బుధవారం రంగాపూర్ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.


