News February 5, 2025

NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు

image

నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.

Similar News

News March 31, 2026

NLG: తగ్గిన టోల్ ధరలు.. రేపటి నుంచే అమలు!

image

HYD- VJY NH 65 మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1 నుంచి టోల్ ధరలు తగ్గనున్నాయి. ఈ కొత్త రేట్లు మార్చి 31 అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుండగా, పంతంగి టోల్ ప్లాజా వద్ద కారు/జీపులకు సింగిల్ జర్నీకి ₹80, రిటర్న్ జర్నీకి ₹115 గాను, కొర్లపహాడ్ వద్ద సింగిల్ జర్నీకి ₹120, రిటర్న్ జర్నీకి ₹180గా నిర్ణయించారు. అలాగే LCV, మినీ బస్సులు, భారీ 3 యాక్సిల్ వాహనాల ధరలు కూడా 2 ప్లాజాల వద్ద గణనీయంగా తగ్గాయి.

News March 31, 2026

రేషన్‌ దరఖాస్తుకు గడువే లేదు: మంత్రి ఉత్తమ్‌

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందజేస్తామని, దరఖాస్తుకు ఎలాంటి సమయ పరిమితి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదొక నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

News March 31, 2026

రేషన్‌ దరఖాస్తుకు గడువే లేదు: మంత్రి ఉత్తమ్‌

image

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు అందజేస్తామని, దరఖాస్తుకు ఎలాంటి సమయ పరిమితి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.రేషన్‌ కార్డుల కోసం ప్రజలు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదొక నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.