News February 5, 2025
PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రేపటి నుంచి ట్రైనింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ట్రైనింగ్ ఇచ్చే మాస్టర్ ట్రైనర్లకు బుధవారం నుంచి హైదరాబాద్లో శిక్షణ మొదలుపెట్టనుంది. వీరి శిక్షణ పూర్తి అయ్యాక టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వసున్నారు. ఈ నెల 15లోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తోందని సమాచారం. ఈ నెల చివరి వారం లేదా మార్చి మొదటివారంలో ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 21, 2026
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పరవాడ మండలం బొట్టవానిపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బొట్టవానిపాలెం గ్రామానికి చెందిన బొట్టా రమణమ్మ (56) పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News March 21, 2026
KNR: అమలుకు నోచుకోని రాజీవ్ యువ వికాసం..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు నోచుకోక నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1,44,640 మంది యువత దరఖాస్తు చేసుకోగా, KNRలో 42,565, పెద్దపల్లిలో 47,470, జగిత్యాలలో 31,128, రాజన్న సిరిసిల్లలో నమోదు చేసుకున్నారు. స్వయం ఉపాధికి రూ.3 లక్షల వరకు సాయం ప్రకటించినప్పటికీ, సంవత్సరం గడిచినా పురోగతి కనిపించక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News March 21, 2026
తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న CM చంద్రబాబు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా CM చంద్రబాబు శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠ 1 నుంచి క్యూ లైన్లో స్వామి వారి మహాద్వారం వద్దకు రాగా అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఆలయంలోకి వెళ్లారు.


