News February 5, 2025
భీమవరం: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని మృతి

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం(M) గునుపూడి గరువపేటలో జరిగింది. డిగ్రీ చదువుతున్న అనూష(19) సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ నెల 3న ఫోన్లో ఇద్దరికి ఘర్షణ జరిగింది. కాసేపటికి అనూష సోదరికి సత్యనారాయణ ఫోన్ చేసి మీ సోదరి చనిపోతా అంటుంది చూడమని చెప్పాడు. అనూష రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News March 16, 2026
HYD: ఎమ్మెల్యే సాబ్.. లొల్లిజేశైనా సమస్య తెంపు!

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.
News March 16, 2026
ఈ సినిమాలకు ‘ఆస్కార్’ దాసోహం

అసాధారణ ప్రతిభకు ‘ఆస్కార్’ అవార్డులు దాసోహమయ్యాయి. 13 నామినేషన్లతో బరిలోకి దిగిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఉత్తమ చిత్రం, దర్శకుడితో సహా 6 అవార్డులను కొల్లగొట్టింది. 16 నామినేషన్లతో చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’ 4 అవార్డులు గెలుచుకోగా, ‘ఫ్రాంకెన్స్టైన్’ 3 సాంకేతిక అవార్డులను దక్కించుకుంది. ఇక ‘కెపాప్ డీమన్ హంటర్స్’ నామినేట్ అయిన 2 విభాగాల్లోనూ విజయం సాధించి 100% రిజల్ట్తో అదరగొట్టింది.
News March 16, 2026
10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.


