News March 19, 2024
కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే
AP: నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. YS షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్కు కేటాయించడం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.
Similar News
News September 30, 2024
ఐపీఎల్ వేలం విదేశాల్లో ఉండొచ్చు: శుక్లా
వచ్చే ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. ‘మన టోర్నీ ప్రాచుర్యాన్ని విదేశాలకూ విస్తరింపచేయాలనేదే మా లక్ష్యం. దానికి తగ్గట్టుగా విదేశాల్లో కూడా వేలం నిర్వహిస్తాం. బయటి దేశాల్లో మ్యాచులెలాగూ ఆడట్లేదు కాబట్టి కనీసం వేలం వంటి ఈవెంట్స్తో జనం దృష్టిని ఆకర్షించాలి’ అని వివరించారు.
News September 30, 2024
CM చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు
AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలిశారు. ప్రజా సమస్యలు, బుడమేరు, కొల్లేరు ఆక్రమణల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం, గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం వంటి అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు.
News September 30, 2024
ఇంగ్లండ్ రికార్డును బద్దలుగొట్టిన భారత్
టెస్టుల్లో ఒక కాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా భారత్ అవతరించింది. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్లలోనే 90 సిక్సులు కొట్టి చరిత్ర లిఖించింది. బంగ్లాతో 2వ టెస్టులో ఈ ఫీట్ సాధించి, 2022లో ఇంగ్లండ్ (29 ఇన్నింగ్స్లలో 89 సిక్సులు) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది మరిన్ని టెస్టు మ్యాచులున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది.