News February 5, 2025

ఎస్సీ, ఎస్టీ కాలనీలలోని దళితుల సమస్యలను గుర్తించండి: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ కాలనీలలో దళితుల సమస్యలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. నూతనంగా ఎంపికైన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సందర్శించి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, బాధితులకు సత్వర న్యాయం, పరిహార చెల్లింపు, తదితర సమస్యలను గుర్తించాలని అన్నారు.

Similar News

News November 9, 2025

KNR: ట్రాఫిక్ చలాన్ పేరుతో సైబర్ మోసం

image

KNR జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ఫేక్ వాట్సాప్ మెసేజ్ పంపి, APK యాప్ డౌన్‌లోడ్ చేయించడంతో చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ ఖాతా నుంచి రూ.70,000లు, ఇతర బాధితుల నుంచి మరో రూ.1.20 లక్షల వరకు సొమ్ము మాయమైంది. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచించారు.

News November 9, 2025

గన్నేరువరం మానసా దేవి ఆలయానికి భక్తుల రద్దీ

image

కార్తీక మాసం ఆదివారం సెలవు దినం కావడంతో గన్నేరువరంలోని ప్రసిద్ధ స్వయంభు మానసాదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 108 శివలింగాలు, జంట నాగులకు జలాభిషేకాలు నిర్వహించి, దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించింది. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వాహనాలను ఉచిత పార్కింగ్ స్థలంలోనే నిలపాలని కమిటీచైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి సూచించారు.

News November 9, 2025

వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.