News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News March 19, 2026

నేడే జాబ్ క్యాలెండర్.. 5 శాఖల్లో 8,340 పోస్టులు!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇందులో 5 శాఖల్లోనే 8,340 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా విద్యాశాఖలో 4,500 పోస్టులు ఉన్నాయని సమాచారం. వర్సిటీల్లో 1,500, DSC, ఇతర పోస్టులు 3 వేలు, హోంశాఖలో 3 వేలు, ఎక్సైజ్ శాఖలో 450 ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో 4 దశల్లో వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. మంత్రి లోకేశ్ ఈ క్యాలెండర్‌ను రిలీజ్ చేయనున్నారు.

News March 19, 2026

నంద్యాల జిల్లాలో యువకుడి సూసైడ్

image

బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో తలారి వెంకటేశ్వర్లు(17) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. తల్లి ఐదేళ్ల క్రితం మాల బాలేస్ అనే వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. నెల కిందట తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లితో గొడవ పడేవాడు. ‘నీ వల్ల గ్రామంలో మా పరువు పోయింది’ అంటూ బాధపడుతూ ఉరేసుకున్నట్లు తండ్రి ఫిర్యాదు చేశారు.

News March 19, 2026

శ్రీకాకుళం: ప్రయాణికుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

image

కాశీబుగ్గ రైల్వేస్టేషన్ రోడ్డు‌లో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మార్గంలో వెళ్తున్న ఓ పాసెంజర్‌ను దుండగుడు అడ్డగించి దాడి చేశాడు. అతని బ్యాగ్‌లోని తీసుకొని పారిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రయాణికుడు గాయాలపాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. స్థానికులు 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.