News February 5, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘ మాసం ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.

Similar News

News March 24, 2026

వార్ ఎఫెక్ట్.. రూ.48 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి(FEB 28) నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 8,590 పాయింట్లు(10.56శాతం), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58 శాతం) పడిపోయాయి. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఏకంగా రూ.48.29 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.463 లక్షల కోట్ల నుంచి రూ.415 లక్షల కోట్లకు పడిపోయింది.

News March 24, 2026

నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తి?

image

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. నిన్న అసెంబ్లీ హాలులో CM రేవంత్, PCC చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. AICC ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News March 24, 2026

NLG: మొదటి విడత ‘రైతు భరోసా’ సంపూర్ణం

image

నల్గొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున 5,22,313 మందికి రూ.268.57 కోట్లు విడుదల చేసింది. జిల్లాకు మూడు విడతల్లో మొత్తం రూ.744.64 కోట్లు మంజూరు కానున్నాయి. 20 రోజుల తర్వాత రెండో విడత, ఆ తర్వాత 25 రోజులకు మూడో విడత నిధులు అందుతాయి. ఈ నెల 25లోపు కొత్త పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసిన 20,668 మందికి త్వరలోనే ఈ సాయం అందనుంది.