News February 5, 2025

పీఏసీ సభ్యుడిగా విష్ణుకుమార్ రాజు

image

రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.

Similar News

News April 3, 2026

విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు

image

విశాఖపట్నం-రాయ్‌పూర్ మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సంబల్‌పూర్ డివిజన్‌లోని మునిగూడ-బిస్సాంకటక్ మధ్య వంతెన ఆధునీకరణ పనులు చేపట్టడమే దీనికి కారణం. ఏప్రిల్ 9, 11, 13, 20, 23, 25 తేదీల్లో రైలు నంబర్లు (58528/58527) రెండు వైపులా నడవవు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.

News April 3, 2026

విశాఖ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు

image

విశాఖలో గురువారం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించనవి-1183, పిలియన్ రైడర్-242, ట్రిపుల్ రైడింగ్-66, ఆటోలపై కేసులు-3, ఓవర్ స్పీడ్-185, సెల్ఫోన్ డ్రైవింగ్-28, ఓవర్ స్పీడ్-185, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-95, రాంగ్ పార్కింగ్-209, డ్రంకెన్‌ డ్రైవ్-35, సీజ్ చేసిన వెహికల్స్-52, MVయాక్ట్ ఉల్లంఘన-441తో కలిపి మొత్తం 2,363 కేసులు నమోదయ్యాయి.

News April 3, 2026

​సింహాచలంలో ‘ఉంగరాల వేట’ వినోదం

image

​సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించారు. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.