News March 19, 2024
పరువు హత్యా? ప్రియుడే చంపాడా?
TG: రంగారెడ్డి(D) దండుమైలారంలో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) హత్య సంచలనంగా మారింది. శశి అనే యువకుడిని ప్రేమించినందుకు ఆమెను తల్లి కొట్టి చంపినట్లు భార్గవి సోదరుడు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తమ కూతురికి బావతో పెళ్లి చేద్దామని నిర్ణయించడంతో తాము ఇంట్లో లేని సమయంలో శశి వచ్చి చంపేశాడని భార్గవి తండ్రి ఆరోపిస్తున్నాడు. దీంతో అమ్మాయి హత్యపై 2 కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 30, 2024
ఇంగ్లండ్ రికార్డును బద్దలుగొట్టిన భారత్
టెస్టుల్లో ఒక కాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా భారత్ అవతరించింది. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్లలోనే 90 సిక్సులు కొట్టి చరిత్ర లిఖించింది. బంగ్లాతో 2వ టెస్టులో ఈ ఫీట్ సాధించి, 2022లో ఇంగ్లండ్ (29 ఇన్నింగ్స్లలో 89 సిక్సులు) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది మరిన్ని టెస్టు మ్యాచులున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది.
News September 30, 2024
గుడ్న్యూస్ చెప్పిన TGSRTC
TG: దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో MGBS, JBS, LB నగర్, ఉప్పల్, ఆరాంఘర్, KPHB నుంచి సర్వీసులు ఉంటాయంది. విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయాభావం తగ్గించేలా గచ్చిబౌలి ORR మీదుగా బస్సులు తిప్పుతామంది.
News September 30, 2024
స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు: APSRTC
AP: దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. అక్టోబర్ 4-20 వరకు 6100 బస్సులు నడుపుతామని, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర నగరాలకు బస్సులు తిప్పుతామంది. అక్టోబర్ 4-11 వరకు 3040 బస్సులు, అక్టోబర్ 12-20 వరకు 3060 బస్సులు తిరుగుతాయని చెప్పింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.