News February 5, 2025
సిద్దిపేట: బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఐదుగురు

BJP సిద్దిపేట జిల్లా దళపతి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో గంగాడి మోహన్ రెడ్డి, అంబటి బాలేష్ గౌడ్, గురువారెడ్డి, నల్ల శ్రీనివాస్, బైరి శంకర్ ముదిరాజ్ ఉన్నారు. బీసీలకు ఇవ్వాలని పలువురు నేతలు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధిష్ఠానం పెండింగ్లో పెట్టింది. పార్టీ పెద్దలు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
News March 15, 2025
GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
News March 15, 2025
పల్లార్గూడ: కరెంటు షాక్తో వ్యక్తి మృతి

పల్లార్గూడ వీఆర్ఎన్ తండాలో విద్యుత్ షాక్ తగిలి గుగులోతు సురేష్ (28) మృతి చెందాడు. వ్యవసాయ బావి వద్ద పొలంలో కరెంటు ఫీజు సరి చేస్తుండగా కరెంటు ఉన్న వైరు తెగి మీద పడడంతో షాక్ తగిలి మృతి చెందినట్లు మృతుని భార్య రేణుక తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సంగెం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.