News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News March 25, 2026

మారనున్న చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

image

ఉ.చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పురుషులదే హవా. ప్రస్తుతం ఒక్క మహిళ కూడా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మూడు MP స్థానాల్లో ఓ స్థానం మహిళకు వెళ్లే అవకాశం ఉంది.

News March 25, 2026

KNR: అసెంబ్లీలో ఐదుగురు ‘మహిళా’ మణులు?

image

పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుండటంతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి KNR(D)లో రాజకీయం కొత్త పుంతలు తొక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో 13 నుంచి 20 స్థానాలకు పెరగనున్న నేపథ్యంలో కనీసం 4- 5 స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో కీలక స్థానాల్లో మహిళా నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఐదుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.

News March 25, 2026

GNT: వార్డుల మార్పు.. ఎవరి ఏరియా మారుతుందో?

image

గుంటూరు జిల్లాలోని మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల సంఖ్య పెరగనుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. వార్డుల సంఖ్య పెరిగితే ప్రజలకు మరింత చేరువగా పాలన అందుతుందని, మౌలిక వసతులు మెరుగుపడతాయని అధికారులు అంచనా, దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.