News February 5, 2025

NZB: UPDATE.. రైలు నుంచి పడిన మృతుడి గుర్తింపు: SI

image

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి – ఉప్పల్వాయి స్టేషన్‌ల మధ్య రైలు నుంచి జారి పడి నిన్న సాయంత్రం ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా మృతుడిని మేడ్చల్ కు చెందిన చిట్యాల భూంరెడ్డి (80) గా గుర్తించినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. మృతుడు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో నుంచి జారి పడినట్లు ఎస్ఐ వివరించారు.

Similar News

News March 20, 2026

నల్గొండ: 20 రోజుల్లోనే రూ.30 పెంపు.. బెంబేలెత్తుతున్న జనం

image

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు జిల్లాలోని వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు వంట నూనెల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. జిల్లాలో గత 20 రోజుల్లోనే కిలో ప్యాకెట్‌పై ఏకంగా రూ.30 వరకు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పామాయిల్ రూ.140కి చేరగా, పల్లీ నూనె రూ.175లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న విమర్శలున్నాయి.

News March 20, 2026

ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

image

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.

News March 20, 2026

ఇంద్రకీలాద్రిలో ప్రారంభమైన వసంత నవరాత్రులు

image

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి వెండి రథోత్సవం భక్తుల నడుమ వైభవంగా జరిగింది. ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ రథాన్ని ప్రారంభించారు. డప్పు, భజనలు, కోలాటాలతో శివనామస్మరణ మారుమోగింది. రథం బ్రాహ్మణ వీధి, కొత్తపేట వరకు సాగింది.