News February 5, 2025

మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేటలో 71,622 మంది ఓటర్లు

image

ఉమ్మడి MDK- KNR-NZB-ADB పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు జాబితాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 71,622 పట్టభద్రులు, ఉపాధ్యాయు ఓటర్లు ఉండగా 174 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు ఓటు వేసేందుకు మరో అవకాశం కల్పించగా ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుది ఓటరు జాబితాను ఈనెల 7న ప్రకటించనున్నారు.

Similar News

News November 11, 2025

ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

News November 11, 2025

వరంగల్: నేడు జాబ్ మేళా

image

జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 11న ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుందని అధికారి సాత్విక తెలిపారు. ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. 18-34 ఏళ్ల వయస్సు గల యువత ఉదయం 11 గంటలకు వరంగల్, ములుగు రోడ్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణానికి హాజరుకావాలని సూచించారు.

News November 11, 2025

కోడిగుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా!

image

కోడిగుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలకు ఉడికించిన గుడ్లు ఇస్తుంటారు. అయితే, కేవలం గుడ్డులోపల ఉన్న పదార్థం మాత్రమే కాదు.. బయట ఉండే పెంకుతోనూ చాలా లాభాలు ఉంటాయి.- కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మొక్కల కుండీల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. -గుడ్డు పెంకులను మెత్తగా చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరుస్తుంది. – పెంకుల పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి అప్లై చేస్తే దంతాలు మెరుస్తాయి.