News February 5, 2025
చికెన్ తినడానికి భయపడుతున్నారా?

APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.
Similar News
News April 19, 2026
‘లెనిన్’లో నాగ్ మార్పులు?

మురళీ కిశోర్ డైరెక్షన్లో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. దీంతో మూవీని ట్రిమ్ చేసే పనిలో ఎడిటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన <<19666338>>‘యెట్టా యెట్టా’<<>> పాట ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News April 19, 2026
మధ్యాహ్నం వరకు ఎండలు.. ఆపై వర్షాలు

TG: ఇవాళ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం 42–45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఆపై HYD, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, NZB, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
News April 19, 2026
మరో ఏడాదిపాటు చీఫ్ సెలక్టర్గా అగార్కర్!

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించనున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. 2027 జూన్ వరకు ఎక్స్టెండ్ చేయనున్నట్లు పేర్కొంది. 2023లో అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయిన తర్వాత భారత్ 2024, 2026 టీ20 వరల్డ్ కప్తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ఆయనే కారణమని విమర్శలూ వచ్చిన సంగతి తెలిసిందే.


