News March 19, 2024

మోదీ ప్రచారంలో పిల్లలు.. ఈసీ సీరియస్

image

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, మోదీ ప్రచారంలో రోడ్డుపై విద్యార్థులను మొహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వార్తాపత్రికల్లో దీనిపై కథనాలొచ్చాయని, ఎన్నికల ప్రచారంలో పిల్లలను తీసుకురావడం చట్టరీత్యా నేరమని ఈసీ తెలిపింది. హెడ్ మాస్టర్‌తో పాటు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖ అధికారి వివరణ ఇవ్వాలన్నారు.

Similar News

News October 16, 2025

రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

image

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.

News October 16, 2025

మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు: బన్నీ వాసు

image

టికెటింగ్ సంస్థ బుక్ మై షో సంస్థపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అసహనం వ్యక్తం చేశారు. వారి యాప్, సైట్‌లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ‘జర్నలిస్టులు నిర్మాణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా. మరి మీ రేటింగ్స్‌తో పనేముంది. అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాలేదు అని రేటింగ్ ఇవ్వడమేంటి? మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారని గుర్తు పెట్టుకోండి’ అని తెలిపారు.

News October 16, 2025

నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

image

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్‌గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.