News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News December 28, 2025
కరీంనగర్: రేపటి నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు హాజరుకావాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
News December 28, 2025
KNR: ప్రశాంతంగా వేడుకలు జరుపుకోండి: సీపీ

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని, అతివేగం వల్ల ప్రమాదాల బారిన పడవద్దని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలని కోరారు.
News December 28, 2025
కరీంనగర్: ఓపెన్ స్కూల్ పరీక్షా ఫీజు గడువు ఖరారు

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు జనవరి 5 వరకు చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ తెలిపారు. 25 రూపాయల ఫైన్తో జనవరి 6 నుంచి 12 వరకు, 50 రూపాయల ఫైన్తో జనవరి 13 నుంచి 16 వరకు, అలాగే తత్కాల్ పద్దతి కింద జనవరి 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. వివరాలకు 9440415099 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


