News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News July 4, 2025
మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా బాలయ్య నియామకం

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా న్యాయవాది బాలయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ పీపీగా నియమితులైన బాలయ్యను మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మర్కంటి రాములు, కార్యదర్శి శిరిగా కరుణాకర్, ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
News July 4, 2025
ఏలూరు: బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న నలుగురి అరెస్ట్

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కైకలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ శుక్రవారం తెలిపారు. కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐ, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.
News July 4, 2025
GWL: ‘కేంద్రం మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి’

గ్రామాలు పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో అచీవర్స్గా నిలవాలనే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలు గ్రామాల్లో అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో శాఖల వారీగా సమాచారాన్ని సేకరించి పంచాయతీ సెక్రటరీ లాగిన్లో నమోదు చేయాలన్నారు. ప్రతి శాఖ నుంచి సమాచారం తీసుకోవాలన్నారు.