News February 5, 2025
ఏపీ నుంచి తెలంగాణ మీదుగా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే మరో 2 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. మచిలీపట్నం-దానాపూర్ మధ్య ఈ నెల 8, 16 తేదీల్లో ఈ రైళ్లు ఉ.11 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే దానాపూర్-మచిలీపట్నం మధ్య ఈ నెల 10, 18 తేదీల్లో మ.3.15 గంటలకు తిరిగి బయల్దేరనున్నాయి. విజయవాడ, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల నాగ్పూర్, మీదుగా ఈ రైళ్లు ప్రయాగ్రాజ్ వెళ్లనున్నాయి.
Similar News
News December 30, 2025
కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.
News December 30, 2025
శివతత్వం: కరుణామయ సంకల్పం

మూడో కంటితో విశ్వాన్ని భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ భక్తుల పట్ల అపారమైన కరుణ చూపే భోళాశంకరుడి నుంచి మనమెంతో నేర్చుకోవాలి. తనను నమ్మిన వారిని ఆదుకోవడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటాడు. బలహీనులను రక్షిస్తూ, ఆర్తులను ఆదుకుంటడు. తోటివారి పట్ల కరుణ చూపి, ఇతరుల తప్పులను క్షమించే గుణం అలవర్చుకోవడమే నిజమైన శివతత్వం. ప్రతికూలతలను జయించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం శివుడి నుంచి నేర్చుకోవాలి.
News December 30, 2025
MAIDSలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

న్యూఢిల్లీలోని మౌలానా అజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(<


