News March 19, 2024
NZB: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 7, 2025
NZB: ఆలయాల మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.
News September 7, 2025
ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర: MLA ధన్పాల్

జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం ఆయన జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
News September 7, 2025
NZB: జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు

నిజామాబాద్ గోల్ హనుమాన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న జెండా బాలాజీ జాతరలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం పాల్గొన్నారు. జెండా, ఉత్సవ మూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ పండితులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆశీర్వచనం అందించారు.