News February 5, 2025

రామగుండం: పదవీకాలం ముగిసింది.. ఫోన్ నంబర్లు బ్లాక్

image

రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్లు మూగనోము పాటిస్తున్నాయి. 50 మంది కార్పొరేటర్లు, 5 కో-ఆప్షన్ సభ్యులు పదవీకాలం ముగియడంతో సంబంధిత అధికారులు ఈ నంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను ఆఫీస్‌కు అప్పగించాల్సి ఉండగా యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించి నెల నెల బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.

Similar News

News November 13, 2025

ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

image

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్‌, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.

News November 13, 2025

సోలార్ విద్యుత్ విస్తరణ వేగవంతం చేయాలి: రెడ్‌కో ఛైర్మన్

image

భద్రాద్రి జిల్లాలో సోలార్ విద్యుత్ విస్తరణకు చర్యలు వేగవంతం చేయాలని టీజీ రెడ్‌కో ఛైర్మన్ శరత్ అన్నారు. సౌరశక్తి వినియోగంపై కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో ఆయన సమీక్ష జరిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యవసాయ పంపుల వద్ద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News November 13, 2025

NRPT: నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలి

image

జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ అధ్యక్షతన డీఎల్ఎస్సీ( డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు. ఇసుక రిచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాహనాలకు జీపీఎస్ మార్చాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్నారు.