News February 5, 2025
KGHలో రౌడీషీటర్ హల్చల్

విశాఖ కేజీహెచ్లో రౌడీషీటర్ బుధవారం హల్చల్ చేశాడు. ఆస్పత్రిలో పనిచేసే రౌడీషీటర్ రాజును విధుల నుంచి తప్పించారు. దీంతో రాజు పిల్లల వార్డుకు ఆక్సిజన్ వెళ్లే పైప్లైన్ను కట్ చేసే ప్రయత్నం చేశాడు. అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ను కత్తితో బెదిరించాడు. మరో ఇద్దరు రాజుకు సహకరించగా ఆసుపత్రి వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
Similar News
News April 6, 2026
GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం లేనట్టే..!

విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా కలరు. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.
News April 5, 2026
క్రెడిట్ చోరీ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు: మంత్రి కొండపల్లి

భోగాపురం విమానాశ్రయ క్రెడిట్ను వైసీపీ తమదిగా చూపించుకునే ప్రయత్నం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కాలంలోనే శంకుస్థాపన జరిగి సుమారు 2,600 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 300 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేశారని, ఆ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం చేయలేదని ఆరోపించారు.
News April 5, 2026
ఏయూని సందర్శించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు

భారత పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు, పీఎంవోకు అకడమిక్ అడ్వైజర్ డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం శర్మ ఆదివారం ఏయూని సందర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన తాతగారు ఉపకులపతిగా సేవలందించిన ఏయూ శతాబ్ధి ఉత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో సందర్శించడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.


