News February 5, 2025
అనకాపల్లి: ‘దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు’
అనకాపల్లి జిల్లాలో గీత కులాల వారికి కేటాయించిన 15 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించినట్లు అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు సాధారణ లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. గీత కులాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 5, 2025
మోకిల: స్కూల్ బస్సును ఢీకొని IBS విద్యార్థి మృతి
స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 5, 2025
నల్గొండ: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్యాపీ హోమ్స్ కాలనీ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. కేశరాజుపల్లికి చెందిన మేకల మహేశ్ (25) పొలం వద్దకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో హ్యాపీ హోమ్స్ సమీపంలో బైక్ అదుపుతప్పి కరెంటు స్తంభానికి ఢీకొంది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News February 5, 2025
పార్కుల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి: బల్దియా కమిషనర్
పార్కుల్లో పెండింగ్ ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్, ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షించారు. కమిషనర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఉన్న వివిధ పార్కులలో దెబ్బతిన్న జిమ్ పరికరాలు, దెబ్బతిన్న లైటింగ్ ఏర్పాటు, నీటి సరఫరా పునరుద్ధరణ, నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలని ఆదేశించారు.