News February 5, 2025

రాజమండ్రి: ఇంటర్, 10వ తరగతి పరీక్షలపై కలెక్టర్ సమావేశం

image

తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 43,754 మంది 51 పరీక్షా కేంద్రాల్లో, 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది 134 పరీక్షా కేంద్రాల్లో వార్షిక పరీక్షలకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటర్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News August 17, 2025

తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

News August 17, 2025

రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పంటల రక్షణ కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.

News August 17, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమం ఈ నెల 18 సోమవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల కార్యాలయాల్లోనే అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.