News February 5, 2025

జవహర్‌నగర్: స్ట్రాబెర్రీల రూపంలో డ్రగ్స్ సరఫరా.!

image

డ్రగ్స్‌‌ను రకరకాల రూపాలతో కొందరు నేరస్థులు తయారు చేసి సరఫరా చేస్తుండగా ఇప్పుడు సరికొత్త రూపంలో బొమ్మల రూపంలో తయారు చేసి స్కూల్స్ వద్ద అమ్ముతున్నట్లు ఒక వాయిస్ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు చాక్లెట్ల రూపంలో సరఫరా చేస్తుండగా ప్రస్తుతం కొందరు నేరస్థులు చిన్న బొమ్మల రూపంలో తయారుచేసి స్కూల్స్ వద్ద అమ్ముతున్నట్లు ఒక ఫొటోతో సహా చక్కర్లు కొడుతోంది. 

Similar News

News November 7, 2025

యువత కోసం CMEGP పథకం!

image

AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా CM ఉపాధి కల్పన (CMEGP) పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌కి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవారంగంలో రూ.2లక్షల-రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల-రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈనెల 10న క్యాబినెట్‌లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

News November 7, 2025

జాతీయ స్థాయి క్రికెట్‌కు మద్దికేర విద్యార్థి ఎంపిక

image

మద్దికేరకు చెందిన కాలువ శ్రీరాములు, లక్ష్మీ కుమారుడు యువరాజు ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయన తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 విభాగంలో మంచి ప్రదర్శన చూపడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. యువరాజ్ ఇంటర్ చదువుతున్నాడు. కరస్పాండెంట్ యజ్ఞం మాధవ్, ప్రిన్సిపల్ సునీత, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 7, 2025

మంత్రాల వల్ల నిజంగానే ఫలితం ఉంటుందా?

image

మంత్రాల శక్తిని కొందరు నమ్మకపోయినా, అవి నిజంగానే సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. మంత్రాలను పదే పదే జపించడం ధ్యానంలాగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో మనస్సు మంత్రంపై కేంద్రీకృతమై ఏకాగ్రత పెరుగుతుంది. మంత్ర జపంతో ఉత్పన్నమయ్యే లయబద్ధ శబ్ద తరంగాలు మనలో మానసిక ప్రశాంతతను పెంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫలితంగా మనలో సానుకూల శక్తి పెరిగి, జీవితం పట్ల మంచి దృక్పథం కలుగుతుంది.