News February 5, 2025
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జిల్లా ప్రజలందరూ సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. తన కార్యాలయం నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను వాట్సప్ ఛానల్ ద్వారా అప్రమత్తం చేస్తూనే ఉంటుందని తెలిపారు. మా ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను వీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 26, 2026
ముంబై ఇండియన్స్.. ప్లేయింగ్-11 ఇదేనా?

IPL-2026లో ముంబై స్ట్రాంగ్గా కనిపిస్తోంది. రోహిత్, సూర్య, పాండ్య లాంటి స్టార్లు ఆ జట్టు సొంతం. బుమ్రా, బౌల్ట్లతో పేస్ దళం కూడా బలంగానే ఉంది. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ప్లేయింగ్ 11 అంచనా: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (C), నమన్ ధీర్, రూథర్ఫర్డ్, శాంట్నర్, శార్దుల్/దీపక్ చాహర్, బుమ్రా, అశ్వని/మయాంక్ మార్కండే, బౌల్ట్.
News March 26, 2026
యువతకు అలర్ట్.. TGPSC OTR గడువు పొడిగింపు

KNR జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తిగా లేదా అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన SC వర్గీకరణ నేపథ్యంలో విద్యా అర్హతల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి APR 10 వరకు అవకాశం కల్పించారు.
News March 26, 2026
HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


