News February 5, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

NLG: సంక్రాంతికి స్పెషల్ బస్సులు

image

సంక్రాంతి పండుగకు ఆర్టీసీ సిద్ధమైంది. పండుగకు స్వస్థలాలకు వచ్చి వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపించేలా ప్రణాళిక రూపొందించింది. ఉమ్మడి నల్గొండ రీజియన్‌లోని 7 డిపోల నుంచి 298 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పండుగ తర్వాత 17 నుంచి 20వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడపనున్నారు.

News January 8, 2026

హరియాణాలో కామారెడ్డి వాసి దారుణ హత్య

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కటికే రజనీకాంత్ (40) హరియాణాలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హరియాణాకు వెళ్లారు.

News January 8, 2026

పాలమూరు: ‘రెండేళ్లు KCR నిద్రపోయిండు’

image

అధికారం పోయాక రెండేళ్లు KCR ఫామ్‌హౌస్‌లో నిద్రపోయిండని వనపర్తి, దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి అన్నారు. <<18792930>>వనపర్తిలో వారు<<>> మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కు ప్రజలు సపోర్ట్ చేస్తుంటే KCR తట్టుకోలేకపోతుండు.. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి నిద్రలోంచి లేచి నీళ్ల దోపిడీ అంటూ మాట్లాడిండు.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అప్పుడే ఎందుకు పూర్తి చేయలేదో BRS వాళ్లు చెప్పాలి’ అని అన్నారు.