News February 5, 2025

సిరిసిల్ల జిల్లాలో ఎస్ఎఫ్ఐ మహాసభలు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ,ఉపాధ్యక్షుడు రాకేశ్, కళ్యాణ్ కుమార్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 9, 2025

కాన్వాయ్ ఆపితే SPని తొక్కిస్తారా: MLA మురళీ

image

YS జగన్ కాన్వాయ్ ఆపితే SPని తొక్కిస్తారా అంటూ పూతలపట్టు MLA మురళీ మోహన్ మండిపడ్డారు. జగన్ పర్యటనలో ఓ విలేకరి గాయపడ్డట్లు పేర్కొన్నారు. ‘మీ పర్యటన సందర్భంగా మీడియాపై ఆంక్షలు విధించారా? కాన్వాయ్ ఆపితే SPని తొక్కించమని చెబుతారు. పెద్దిరెడ్డి DSP చేయి నరకమని పురమాయిస్తారు. ఒక్క రైతు, ఫ్యాక్టరీ యాజమాని లేకుండా ఆయన పర్యటన జరిగింది. జనం తొక్కడంతో టన్నుల పంట నాశనం అయింది’ అంటూ ఆయన ఓ మీడియాతో మాట్లాడారు.

News July 9, 2025

పెంపుడు కుక్క మీ జీవితకాలాన్ని పెంచుతుంది!

image

పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్‌పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. మీకూ పెంపుడు కుక్క ఉందా? కామెంట్ చేయండి.

News July 9, 2025

మెగా పేరెంట్స్ డే ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రైవేట్, ప్రభుత్వ, జూనియర్ కళాశాల యజమానులు, విద్యాశాఖ అధికారులతో మెగా పేరెంట్స్ డే నిర్వహణపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం కలెక్టర్ సమీక్షించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు క్రమ పద్దతిలో, మధ్యాహ్న భోజనం అందరికీ అందేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థి తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం, తల్లికి వందనం లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు.