News February 5, 2025
పాడేరు: ‘ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు’

శాసన మండలి ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ MLC, పట్టభద్రుల MLC ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో బుధవారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈనెల 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ MLC, గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు.
Similar News
News April 17, 2026
నిప్పుల కొలిమిలా నిజామాబాద్ జిల్లా

నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. అత్యధికంగా ఎడపల్లి, ఆర్మూర్ మండలంలోని పెర్కిట్లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, మాక్లూర్ మండలాల్లో కూడా 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. జిల్లాలో అంతటా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఆందోళనకరం.
News April 17, 2026
బుమ్రా స్పీడ్ పెంచాలి.. ఇర్ఫాన్ సూచనలు

IPL: MI స్టార్ బౌలర్ బుమ్రా ఈ సీజన్లో ఆడిన 5 మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ పలు సూచనలు చేశారు. బుమ్రా బౌలింగ్ వేగం తగ్గిందని, దాంతో పాటు స్లో బాల్స్ ఎక్కువగా వేస్తున్నారన్నారు. అలా కాకుండా వేగంగా బౌలింగ్ చేస్తూ అప్పుడప్పుడు స్లో బాల్స్ వేస్తే వికెట్లు వచ్చే ఛాన్సుందన్నారు. బుమ్రాకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదని, చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.
News April 17, 2026
HYD: 1990లోనే నగర చెరువుల మరణశాసనం!

నగర చెరువుల మరణశాసనం 1990ల్లోనే మొదలైంది. 10 హెక్టార్ల లోపు ఉన్న కుంటలను నివాస ప్రాంతాలుగా మార్చుకోవచ్చన్న ప్రభుత్వ నిర్ణయంతో 3,000కు పైగా నీటి వనరులు కనుమరుగయ్యాయి. 60 వేల చెరువుల లెక్కలున్నా నిజాం కాలం నాటి ఉర్దూ రికార్డులను కావాలనే తొక్కిపెట్టారా? రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనం కోసమే ఈ అదృశ్య పర్వం సాగిందా? అన్నట్లు తయారైంది. నేడు మిగిలిన కొద్దిపాటి జలవనరుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది.


