News February 5, 2025

వారికి ఉచిత రేషన్ రద్దు?

image

దేశంలో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఏరివేత ప్రక్రియ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. కాగా గతేడాది జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. PMGKAY కింద పేదలకు కేంద్రం 5 కిలోల బియ్యం/గోధుమలు ఇస్తోంది.

Similar News

News January 26, 2026

వేరుశనగకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

image

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ రికార్డు స్థాయి ధర పలుకుతోంది. TGలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఆదివారం వేరుశనగకు రూ.12,009 రికార్డు స్థాయి ధర లభించింది. వనపర్తిలో క్వింటాకు రూ.12,002.. అచ్చంపేటలో క్వింటాకు రూ.11,877 ధర లభించింది. వేరుశనగకు ప్రస్తుతం క్వింటాకు రూ.6 వేలు- రూ.10వేలకు పైగా ధర పలుకుతోంది. తమ పంటకు పెరుగుతున్న డిమాండ్ చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News January 26, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ₹2,450 పెరిగి రూ.1,62,710కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ₹2,250 ఎగబాకి రూ.1,49,150 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర ₹69వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 26, 2026

టీ20 వరల్డ్‌కప్‌ సమావేశంలో BCB ఛైర్మన్ అసహనం!

image

T20 WC విషయంలో ICCతో జరిగిన సమావేశంలో BCB ఛైర్మన్ సహనం కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల సాకుతో తమ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరిన విషయం తెలిసిందే. 3 వారాల పాటు చర్చలు సాగినప్పటికీ ఆ ప్రతిపాదనను ICC తిరస్కరించింది. చివరకు బంగ్లాను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో BCB ఛైర్మన్ అమినుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.